Electoral Bond: ఎలక్టోరల్ బాండ్ - సుప్రీం కోర్టు తీర్పు
- CDVM COMMUNITY
- Feb 16, 2024
- 1 min read

ఎలక్టోరల్ బాండ్ అంటే ఏమిటి?
వ్యక్తులు లేదా సంస్థలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఆర్థిక పరికరంగా పని చేస్తాయి. రాజకీయ పార్టీలకు నిధుల సహకారం కోసమే ఈ బాండ్లను ప్రత్యేకంగా జారీ చేయబడుతుంది. ఇలాంటి వాటినే ఎలక్టోరల్ బాండ్ అంటారు. వీటిని రూ.1,000, రూ.10,000, రూ.1 లక్ష, రూ.10 లక్షలు, రూ.1 కోటి గుణిజాలలో విక్రయించబడతాయి. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాల్ని బ్యాంక్, రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 బడ్జెట్ లో మొదటి సారి ప్రవేశ పెట్టారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి ఒక ఆర్థిక పరికరంగా పని చేస్తుంది. అయితే, ఈ బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు జరిగాయి.
ఎలక్టోరల్ బాండ్లను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 1951లోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించడానికి అర్హులు.
ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన SBI శాఖలలో అందుబాటులో ఉంటాయి.
బాండ్ కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు కంట్రిబ్యూటర్లు ఈ బాండ్లను తమకు నచ్చిన పార్టీకి అందిస్తారు.
ఈ బాండ్లపై బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు.
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి త్రైమాసికం ప్రారంభంలో 10 రోజుల పాటు బాండ్లను కొనుగోలు చేస్తుంటారు..
సుప్రీం కోర్టు తీర్పు
ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని కూడా ఆదేశించింది.
ఈ బాండ్ల కోసం IT చట్టంలోనూ, ప్రజాప్రాతినిథ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఎలక్టోరల్ బాండ్స్కు విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లు' రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
Comments